బిజినెస్ ఐడియా : తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం!

Purushottham Vinay
బిజినెస్ ను కొత్తగా చేయాలని అనుకోనేవారికి అదిరిపోయే ఐడియా ఉంది..సొంతంగా భూమి ఉన్న వారికి ఇది ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని తెచ్చే ఐడియా..ఇక అదే గులాబీల పెంపకం.ఇక మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న వాడ్జీ గ్రామ నివాసితులు గులాబీ పూలు సాగు చేస్తూ లక్షల్లో డబ్బుని సంపాదిస్తున్నారు.ఇక వాడ్జీ అనేది దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ఒకటి.నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక తాగే నీటి కోసం మైళ్ల కొద్దీ దూరం వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఇక్కడ చాలా సర్వసాధారణం. అలాగే పూర్తిగా వర్షంపైనే ఆధారపడి పంటలు పండిస్తారు ఇక్కడి రైతులు. ఈ సమస్యల ఎదుర్కొనేందుకు కొందరు రైతులు చేసిన ప్రయత్నం ఇలా మంచి ఫలితాలను ఇస్తుంది.నీటి అవసరం చాలా తక్కువగా ఇంకా అలాగే నిర్వహణా అనేది తక్కువే కావడంతో గులాబీ సాగు వైపే మొగ్గు చూపారని కుండ్లిక్ కుమార్ వివరించాడు. ఇక కుండ్లిక్ మొదట 0.25 ఎకరాల భూమిలో రసాయన పద్ధతులను ఉపయోగించి ఈ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. దీని వల్ల కిలోకు రూ.4 ధర అనేది లభించింది. మతపరమైన సందర్భాలలో ఇంకా ధరలు కిలో రూ.15 వరకు పెరిగాయని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు.


కుండ్లిక్‌తో పాటు పూల పెంపకాన్ని కూడా స్వీకరించిన ఇతర రైతులు వ్యాపారంలో అభివృద్ధి చూడటం ప్రారంభించారు..అలా ఒక్కొక్కరూ ఆ తోట వేస్తూ ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు.ఇక క్రమంగా గులాబీ విస్తీర్ణం 300 ఎకరాలకు చేరింది. మార్కెటింగ్ సమస్యగా మారడంతో వారంతా కూడా కలిసి అధికారులను ఆశ్రయించారు. పూలను రోజ్ వాటర్, గుల్కంద్, ఎసెన్స్ ఇంకా అలాగే ఇతర ఉత్పత్తులలో ప్రాసెస్ చేయాలని అధికారి సూచించినట్లు కుండ్లిక్ చెప్పారు. రైతులకు మార్కెటింగ్ నైపుణ్యంతో శిక్షణ ఇస్తామని కూడా ఆ అధికారి హామీ ఇచ్చారు. ఇక ఈ ప్రక్రియను తెలుసుకునేందుకు రైతులు ఆ ప్రాంతంలోని డిస్టిల్లర్లను కూడా సంప్రదించారు..అలా 50 వేల పెట్టుబడి తో మొదలైన ఈ వ్యాపారం ఎన్నో లక్షల ఆదాయాన్ని ఇస్తుంది..కేవలం గులాబీ మాత్రమే కాదు అందులో కూరగాయలు కూడా పెంచడంతో ఈ ఆదాయం అనేది బాగా రెట్టింపు అవుతుంది.కాబట్టి ఆసక్తి వున్న వారు లక్షల్లో డబ్బుని సంపాదించాలనుకునేవారు ఈ బిజినెస్ ఐడియాని ఫాలో అవ్వండి. జీవితంలో బాగా స్థిరపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: