విమానం ఎక్కాలనుకునేవారికి అదిరిపోయే ఆఫర్..ఇలా చేస్తే భారీ తగ్గింపు..!

Satvika
కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది.. ముఖ్యంగా చెప్పాలంటే మద్య తరగతి వారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. గత ఏడాది మనిషి కోరికల పై కరోనా నీళ్ళు చల్లింది.. దాంతో ప్రతి ఒక్కరూ ఈ ఏడాది లో మిగిలిన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా, చాలా మందికి విమానం ఎక్కాలని ఆశాగా ఉంటుంది. అయితే, కొన్ని రకాల ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎక్కడం మానేస్తారు.. ఇప్పుడు అలాంటి వారి కోరికను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది.

విమానం ఎక్కాలని భావించే వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా విమాన టికెట్లపై భారీ తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ విమాన టికెట్ల పై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దేశీ విమాన ప్రయాణానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు. 2021 మార్చి 29 వరకు ఈ ఆఫర్ అందుబాటు లో ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.

ఈ విషయాన్ని స్వయంగా ఆ బ్యాంక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా యాత్రా.కామ్ నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. గరిష్టంగా రూ.1,200 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అయితే బుకింగ్ వ్యాల్యూ కనీసం రూ.3,500 ఉండాలి.. అయితే ఈ ఆఫర్ ను బ్యాంక్ కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవాలి..అలాగే కన్ఫార్మ్ టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇకేందుకు ఆలస్యం మీరు విమాన ప్రయాణం చేయాలనే ప్లాన్‌లో ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: