భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!
ఇక నిఫ్టీ 50 లో నేడు లాభనష్టాల విషయానికి వస్తే... ఇందూస్ ల్యాండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ సంస్థ లకు సంబంధించిన కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఇందులో ముఖ్యంగా ఇందూస్ ల్యాండ్ బ్యాంక్ ఏకంగా 8 శాతం మేర లాభాల బాట పడ్డాయి. అలాగే ఇక నష్టాల విషయం చూస్తే హెచ్యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్, నెస్లే కంపెనీలు అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ముందుగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా హెచ్యూఎల్ 0.7 శాతం మేర అత్యధికంగా నష్టపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో అన్ని రంగాలు కూడా లాభాల బాట పట్టాయి. ఫార్మా, ఎఫ్ఎంసిజి, మీడియా, బ్యాంకింగ్, ఆటోమొబైల్, మెటల్ ఇలా అన్ని రంగాలు లాభాల లోనే ముగిసాయి.
ఇలా నగదు విభాగం చూస్తే తాజాగా విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు 2080 కోట్ల విలువైన స్టాక్స్ ను అమ్మగా, దేశీయ ఫండ్స్ దారులు రూ. 2071 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇక భారతదేశంలో నేటి పసిడి, వెండి ధరల విషయం చూస్తే... హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 110 రూపాయలు నష్టపోయి 50,240 వద్ద ముగియగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 110 రూపాయలు నష్టపోయి 47,700 రూపాయల వద్ద ముగిసింది. ఇక అలాగే కేజీ బంగారం ధర 1000 రూపాయలు నష్టపోయి 58000 వేలకు చేరుకుంది.