అనుకోకుండా ఒక్క సారి సుడిగాలిలా దూసుకువచ్చిన పతంజలి ఉత్పత్తులపై సంశయం నెలకొంది. అదీ ఇండియన్ ఆర్మీ కాంటీన్ల నుండి ఒక ఆమ్లా జ్యూస్ వినియోగాన్ని నిలిపివేసింది. దీంతో పతంజలి ఆయుర్వేద కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగి లింది. ఆ సంస్థ తయారు చేసే "ఆమ్లా జ్యూస్" ల్యాబ్ టెస్టులో ఫెయిలైంది.
దీంతో తమ క్యాంటీన్స్ నుంచి ఆ ఉత్పత్తిని తొలగించింది ఇండియన్ ఆర్మీ అంతేకాదు కంపెనీకి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ జ్యూస్ పై కోల్కతా లోని వెస్ట్ బెంగాల్ హెల్త్ లేబొరేటరీ పరీక్షలు నిర్వహిం చింది. టెస్ట్ ఫెయిలైన వెంటనే ఈ ప్రోడక్ట్ అమ్మకాలను నిలిపేసి, ఆ సంస్థ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంస్థ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ తెలిపింది.
అయితే ఆమ్లా జ్యూస్ ఓ ఆయుర్వేదిక్ ఔషధమని, దానిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిం చాలని పతంజలి సంస్థ వాదిస్తున్నది. ఈ జ్యూస్కు "ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా" నిబంధనలు వర్తించవని చెబుతున్నది. దీనిపై రాందేవ్ బాబా కంపెనీ ఐన "పతంజలి ప్రొడక్ట్స్" "ఎఫ్ఎంసీజీ" ని ప్రశ్నించగా. ఉసిరి కాయ రసం ఓ వైద్య ఉత్పత్తి అని, దీనివల్ల ఎలాంటి హాని జరగదని చెప్పింది.