కేసీఆర్కు గుదిబండగా మారిన ఆ జీవో ఎత్తేస్తారా?
317 జీవో ను రాత్రికి రాత్రే విడుదల చేసిన అమలు చేశారని... ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటివరకు 30 మంది ఉపాధ్యాయులు అతహత్యాలు చేసుకున్నారని టీచర్లు తెలిపారు. 317జీవో పై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరికి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని టీచర్లు హెచ్చరించారు. అక్రమ అరెస్ట్ లకు నిరసన పోలీస్ స్టేషన్ లో మైనార్టీ మోర్చా నాయకులు ఆందోళన కొనసాగించారు. ఉపాధ్యాయులను బాధపెట్టిన ఏ ప్రభుత్వం మనుగడలో లేదని... భార్య, భర్తలను వేరు చేసి వారి మధ్య మానసిక వేదనను కలిగిస్తున్నారని...నాయకులు ఆరోపించారు.