ట్రావెల్స్ సంక్రాంతి దోపిడీపై రవాణా శాఖ వార్నింగ్?
ప్రయాణికుల కు ఇబ్బంది లేకుండా బస్సు గమ్యస్థానం చేరాక బస్సులు సీజ్ చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణమార్గాలు ఎంచుకుని ప్రయాణం చేయాలని విజ్ణప్తి చేస్తున్నామని ఆంజనేయులు తెలిపారు. ఇంటర్నెట్ లో ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేసే చార్జీల వివరాలు తీసుకుని ఆధారాలు తీసుకుని కేసులు రాయాలని నిర్ణయించారు. ప్రయాణికులు రవాణా శాఖ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.