ఆన్‌లైన్‌ గేమ్‌.. 94 లక్షలు పోగొట్టిన కొడుకు?

Chakravarthi Kalyan
ఆన్ లైన్ లో గేమ్ ఆడి దాదాపు కోటి రూపాయలు పొగొట్టుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాబాద్ సమీపంలోని సీతారాంపేటకు చెందిన భూనిర్వాసితుడైన ఓ రైతుకు కొన్ని రోజుల క్రితం భూ పరిహారంగా కోటి 5 లక్షల సొమ్ము వచ్చింది. ఇది ఆయన అకౌంట్‌లో ఉంది. దీంతో రైతు మరొక భూమి కొనుగోలుకు ఒప్పందం కూడా చేసుకున్నాడు. అందుకు బయానాగా కొంత సొమ్ము కూడా ఇచ్చాడు.
మిగతా డబ్బు తన చిన్న కుమారుని బ్యాంకు ఖాతాలో ఆ రైతు ఉంచాడు. ఈ సమయంలో కుమారుడు 'కింగ్ 567' అనే ఆన్ లైన్ గేమ్ ఆడాడు. ఆ ఆటలో ఆ యువకుడు ఏకంగా 95 లక్షల నగదుని పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఈ విషయం గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తమ డబ్బును ఇప్పించాలని ఆ రైతు దంపతులు వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: