కేసినోలపై కేంద్రం కన్ను.. ఎవరికి మూడిందో?
ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ కోసం నియమ నిబంధనలు రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. ఆన్లైన్ గేమింగ్పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఆన్లైన్ గేమింగ్లో ఆడేది స్కిల్ గేమా లేక చాన్స్ గేమా అనే దానితో నిమిత్తం లేకుండా బెట్టింగ్, గాంబ్లింగ్ వంటి ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీ విధిస్తోందని పంకజ్ చౌదరి తెలిపారు.