కేసినోలపై కేంద్రం కన్ను.. ఎవరికి మూడిందో?

Chakravarthi Kalyan
కాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాలపై కేంద్రం కన్నేసింది. వీటి విలువను అంచనా వేసి వాటిపై ఎంత రేటు చొప్పున జీఎస్టీ విధించవచ్చో పరిశీలన చేయడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెబుతున్నారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా బదులిచ్చారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ కోసం నియమ నిబంధనలు రూపొందించే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఆడేది స్కిల్‌ గేమా లేక చాన్స్‌ గేమా అనే దానితో నిమిత్తం లేకుండా బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తోందని పంకజ్ చౌదరి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: