జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు మరో షాక్?
ఈ కేసును పిటిషనర్ తరఫు న్యాయవాది కోటేశ్వరీదేవి వాదించారు. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు పిటిషనర్ పై కేసు పెట్టారని వాదించారు. టీడీపీ సానుభూతిపరులను వేధించడం కోసం తప్పుడు ఫిర్యాదు చేశారని వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావని తేల్చిచెప్పింది. కేసును కొట్టేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా పాలకొల్లు కోర్టులో జరుగుతున్న కేసును కూడా రద్దు చేసింది. సామాజిక మాధ్యమ పోస్టు ఒక వేళ పరువునష్టం కలిగిస్తే బాధితులే ఫిర్యాదు చేస్తారని కోర్టు కామెంట్ చేసింది.