బంపర్ ఆఫర్‌: రూ. 60 వేలకే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం..?

Chakravarthi Kalyan
విజయవాడలోని ఓ సంస్థ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. డయల్ సంస్థ పేరుతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి సిద్ధార్ద్ అనే వ్యక్తి బాధితుల నుంచి నగదు వసూలు చేశాడు . ఒక్కొక్కరి నుంచి 60 వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు  సిద్ధార్ద్ వసూలు చేశాడు. మూడు నెలల్లో ఉద్యోగాలిప్పిస్తానని ..లేదంటే డబ్బు తిరిగి ఇచ్చేస్తానని  సిద్ధార్ద్ నమ్మించాడు . అంతే కాదు. నమ్మకం కలిగించేందుకు బాండ్ పేపర్లు , బ్యాంక్ చెక్కులు కూడా  సిద్ధా ర్ద్ఇచ్చాడు . నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవటంతో నిలదీసిన కొందరికి విడతల వారీగా  సిద్ధార్ద్ కొంత నగదు తిరిగి ఇచ్చాడు.

బాధితుల ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు . డయల్ సంస్థ నిర్వాహకుడు సిద్ధార్ద్ అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: