ఏపీలో రూ.1000 కోట్ల అవినీతికి రంగం సిద్ధం?

Chakravarthi Kalyan
ఏపీ రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి రంగం సిద్ధమైందని మాజీ ఎంపీ చింతా మోహన్ అంటున్నారు. వ్యవసాయానికి మీటర్ల బిగించే వ్యవహారంలో ఈ తతంగం సాగుతోందని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఆరు వేల రూపాయల విలువైన మీటర్ ను 30 వేలకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోందని మాజీ ఎంపీ చింతా మోహన్ తెలిపారు. దేశంలోని మీటర్ల మాఫియా ద్వారా ఈ తతంగం సాగుతోందని మాజీ ఎంపీ చింతా మోహన్ చెప్పారు.
ఇందుకోసం క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపిందని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 3600 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని మీటర్లు బిగించనున్నట్లు మాజీ ఎంపీ చింతా మోహన్ తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని మీటర్లు ఆంద్రాలో మాత్రం ఎందుకు బిగిస్తున్నారో అంతుచిక్కడం  లేదని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: