మోడీ ఒక్క మాట చెబితే.. పీవోకే స్వాధీనమే?

Chakravarthi Kalyan
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్.. పీవోకే..ఇది ఒకప్పుడు ఇండియా భూభాగమే.. పాకిస్తాన్ ఆ తర్వాత ఆక్రమించుకుంది. ఇప్పటికీ ఇది పాక్ ఆధీనంలోనే ఉంది. కానీ ఇండియా మాత్రం ఇది మన భూభాగమే అని చెబుతుంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందంటున్నారు సైన్యాధిపతులు. తాజాగా భారత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ మేరకు ఓ సంచలన ప్రకటన చేశారు.
ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో 300 మంది ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నట్లు భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మరో 160 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్  వైపు లాంచ్ ప్యాడ్ లలో ఉన్నట్లు భారత సైన్యాధికారి లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది తెలిపారు. 2019లో ఆర్టికల్  370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో భద్రతా పరిస్థితి మెరుగైందని లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఉగ్ర కార్యకలాపాలను చాలా వరకు కట్టడి చేసినట్లు లెఫ్టినెంట్  జనరల్  ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: