ఏపీలో చర్చిల నిర్మాణం: బీజేపీ VS వైసీపీ?

Chakravarthi Kalyan
ఏపీలో మరోకొత్త వివాదం మొదలైంది. అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ చర్చిల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసిందని వార్తలు వచ్చాయి. దీన్ని తప్పుపడుతూ న్యాయపోరాటం సాగిస్తామని బీజేపీ అంటోంది. ప్రభుత్వ నిధులను చర్చిలకు ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని వైసీపీ మతతత్వ పార్టీగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
వైసీపీ మతాలతో రాజకీయం చేస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్ర ప్రభుత్వం బరి తెగించి వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ మిత్రపక్షమైన జనసేన ఇళ్ల నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పర్యటించి సోషల్‌ ఆడిట్ నిర్వహిస్తుంటే వైసీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు నిరోధించడాన్ని గట్టిగా ప్రయత్నిస్తుండడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వైసీపీ నేతలు ఈ తరహా కార్యక్రమాల నుంచి వెనక్కి వెళ్లకపోతే తాము కూడా రోడ్డు మీదకు రావాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: