పోలవరం ఆలస్యానికి కారణం బయటపెట్టిన బుగ్గన?
ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోడానికి సమయం పడుతోందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నించటం వల్లే నిర్మాణం ఆలస్యమైనట్టు మంత్రి బుగ్గన అన్నారు. గత ప్రభుత్వ హాయంలోనే ఎక్కువ అప్పులు చేశారని మంత్రి బుగ్గన అన్నారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల పెద్ద అప్పుల మంత్రి అయితే చంద్రబాబు అబద్ధాల నాయుడని మంత్రి బుగ్గన ఆక్షేపించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారని మంత్రి బుగ్గన అన్నారు.