వామ్మో.. 5 కేజీల గుమ్మడి కాయ.. రూ.50 వేలు?
మన దగ్గర వినాయక విగ్రహాల వద్ద లడ్డూను వేలం వేస్తారు కదా.. ఈ లడ్డు కొనుక్కుంటే శుభం కలుగుతుందని నమ్మకం కదా. అదే తరహాలో కేరళలో ఓనం పండుగ సందర్భంగా గుమ్మడి కాయను వేలం వేస్తారు. వాటికి మంచి ధర వస్తుంది. తాజాగా ఇడుక్కిలో 5 కిలోలున్న గుమ్మడి కాయను ఓ వ్యక్తి 50 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఓనం పండగ సమయంలో నిర్వహించే వేలంలో పొట్టేలు, కోళ్లకు కూడా మంచి ధర వస్తుంది. కానీ ఈ సారి గుమ్మడికాయకు కూడా ఇంత రేటు పలకడం మాత్రం విశేషమే అంటున్నారు.