ఇండియన్స్ బాగా అప్డేట్ అయ్యారుగా?
డిజిటల్ లావాదేవీలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ లావాదేవీల విలువ 10.73 లక్షల కోట్లుగా నమోదైందట. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్.. ఎన్ పీసీఐ చెప్పింది. జులై నెలలో 10.63 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నడిచాయి. అంటే ఆగస్టులోనూ ఈ విషయంలో వృద్ధి నమోదైంది. మొత్తం డిజిటల్ పేమెంట్ లావాదేవీల సంఖ్య ప్రస్తుతం 657 కోట్లకు పెరిగింది.