ఎన్ని టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా కలుస్తుందో?
అలాగే కృష్ణా కూడా కొన్నేళ్లుగా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది. కృష్ణా నది నుంచి ఇప్పటి వరకూ 220 టీఎంసీల నీరు సముద్రానికి వెళ్లనట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాగర్ జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీరు నిల్వ ఉంది. దిగువన పులిచింతలలో నిల్వ చేసే పరిస్థితి లేదు. అందుకే ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రానికి వదులుతున్నారు. అటు గోదావరి పరిస్థితి అంతే.