కొత్త రాష్ట్రపతి ఫ్లాష్బ్యాక్ తెలిస్తే షాకవుతారు?
ఈసారి మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఇక ఈ ద్రౌపది ముర్ము ఎవరంటే.. ఆమె గతంలో ఓ ఒడిశా టీచరమ్మ. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలర్, వైస్ ఛైర్పర్సన్, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్గా వివిధ హోదాల్లో పని చేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు కూడా తీసుకున్నారు. ఆమె బాల్యం నుంచి సంఘ్ పరివార్తో సన్నిహితంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. విద్యాభ్యాసం తర్వాత సేవారంగంలో ప్రవేశించి మయూర్భంజ్ ఆదివాసీల హితం కోసం ముర్ము ఉద్యమించారు.