జగన్‌కు అదిరిపోయే గుడ్‌ న్యూస్.. ఆ జడ్జి బదిలీ?

Chakravarthi Kalyan
ఇది ఏపీ సీఎం జగన్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే.. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి మధుసూదన్‌రావు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. మధుసూదన్‌రావు తెలంగాణ వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌ పర్సన్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇప్పుడు ఆయన స్థానంలో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా సీహెచ్ రమేశ్‌బాబు వచ్చారు. ఈ రమేశ్‌ బాబు ప్రస్తుతం కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జిగా ఉన్నారు. సదరు సీహెచ్ రమేశ్‌బాబు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వస్తున్నారు.

ఇది జగన్‌కు ఎలా గుడ్ న్యూస్ అవుతుందంటారా.. ఎందుకంటే.. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ... సీఎం జగన్ కేసుల విచారణపై ప్రభావం చూపిస్తుంది. పలు డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు విన్న ప్రస్తుత సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్లపై మళ్లీ విచారణ  కొనసాగుతుంది. దీనివల్ల విచారణ మరింత జాప్యం అవుతుంది. జగన్‌కు కావాల్సింది కూడా అదే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: