కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి?

Chakravarthi Kalyan
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గన్పూర్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. కారును ఎదురుగా వస్తున్న బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదురుగు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో ఆ ధాటికి ఓ బాలుడు ఎగిరి బయటపడ్డాడు. అలా బయట పడటం వల్లే ఆ చిన్నారి ప్రాణాలతో బతికిబయటపడ్డారు. కారులో చిక్కుకున్న ఐదురుగు దారుణంగా చనిపోయారు. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ప్రమాద స్థలం భీతావహంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: