కడప ఎంపీ కోరిక రైల్వే మంత్రి తీరుస్తారా?

Chakravarthi Kalyan
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి విజ్ఞాపన అందజేశారు. ముదిగుబ్బ నుండి ముద్దనూరు వయా పులివెందుల చుట్టూ 65 కి.మీ రైల్వే లైను ఏర్పాటు చేయాలని అవినాష్‌రెడ్డి కోరారు. బనగానపల్లి నుండి కర్నూల్ వయా బేతంచెర్ల మధ్య 70 కి.మీల మధ్య కొత్త రైల్వే లైన్ల కోసం చర్యలు తీసుకోవాలని అవినాష్‌ రెడ్డి కోరారు. రెండు కొత్త రైల్వే లైన్‌ల కోసం ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారని అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. ఈ రెండు కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని... ఈ మార్గాలలో ప్రయాణీకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని అవినాష్‌ రెడ్డి తెలిపారు.  ఈ మార్గాలలో అనేక సిమెంట్, ఇతర పరిశ్రమలు ఉన్నాయని.. ఇవి చాలా వరకు సరుకుల రవాణాకు పెద్ద మార్గం అవుతుందని కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: