అవిభక్త కవలలు.. విడివిడిగా భలేగా ఓటేశారు..!

Chakravarthi Kalyan
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త కవలలు విడివిడిగా ఓట్లేశారు.. అవిభక్త కవలలైన సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌ తొలిసారిగా అమృత్‌ సర్‌ లోని మనావాలాలో తమ ఓటు వేశారు. నడుం వరకూ ఒకే శరీరం.. రెండు తలలు ఉన్న వీరిద్దరినీ ఇద్దరు ఓటర్లుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వారికి ఓటు హక్కు కల్పించింది. ఒకే శరీరాన్ని పంచుకుంటున్న ఈ సోదరులకు మొదటిసారి తమ ఓటు హక్కు వాడుకున్నారు.

మరి ఓటు గోప్యంగా వేయాలి కదా.. ఇద్దరు వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత పాటించాలి కదా.. అందుకే పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఆర్వో..వారికి ప్రత్యేకమైన కళ్లజోడు ఏర్పాటు చేశారు. ఒకరు ఓటు వేసేటప్పడు మరొకరు కళ్లజోడు పెట్టుకుంటూ ఓటేశారు. ఇది చాలా ప్రత్యేకమైన కేసు అని..దీనిపై వివాదం రాకుండా వారు ఓటేసేది ప్రత్యేకంగా వీడియోగ్రఫీ కూడా చేయించారు. వారు ఒకే శరీరంతో కలసి ఉన్నా.. ఇద్దరు వేర్వేరు ఓటర్లని అందుకే గోప్యత కోసం కళ్లజోడు ఇచ్చామని ఆర్వో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: