హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో సమంత ?


సినీనటి సమంత అస్వస్తులయ్యారా ? ఏమో ఎవరికి తెలుసు? అని సమాధానం మాత్రం ఇవ్వకండి. ఆమె నిన్ననే కదా కడపలో సందడి చేశారు. పలు కార్యక్రమాలలో పాల్గోన్నారు . ఇంతలో ఏమైంది అని అడగొద్దు.. ఆమెకు సూస్తీగా ఉందని సామాజిక మాధ్యమాలలోప్రాచారం వెల్లువెత్తుతోంది.
కడప జిల్లా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సినీనటి  సమంత కు జ్వరం రావడంతో ఆమె చికిత్స నిమిత్తం తన ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించారు.  జ్వరం తగ్గే సూచనలు కనపడక పోవడంతో డాక్టర్ సూచన మేరకు హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిని సంప్రదించగా వారి అడ్మిట్ చేసుకున్నారని, వరుస వెంబడి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, సన్నిహిత వర్గాల సమాచారం.  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆమె వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. సమంత ఆరోగ్యం పై ఇంతవరకూ ఏఐజి వైద్యులు ఎలాంటి  నివేదికను వెల్లడించ లేదు. దీంతో మీడియా జనానికి ఆతురత ఎక్కవవైంది. తెలుగు సినీ ప్రముఖులు కొందరు ఆసుపత్రి వద్దకు వెళ్లివచ్చారని కూడా  సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. సమంతా .. త్వరగాకోలుకోవమ్మా  అని కొందరు, రోజులు బాగోలేవు కదా.. ఎందుకు బైటికి వెళ్లావు అని మరి కొందరు... కొంపదీసి కరోనా లేదుకదా అని ఇంకోందరు... ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కంటికి కనిపించని శత్రువు తో ప్రపంచం అంతా పోరాడుతున్న వేళ ఎవరైనా కాస్త జాగ్రత్త వహించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: