నన్ను సాదుకుంటరా..చంపుకుంటరా అంటూ హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ ఎమోషనల్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు మాట్లాడేవి అన్నీ అబద్ధాలేనని ఈటల చెప్పారు. పదవులు ఇచ్చారు, అవమానించి బయటికి పంపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ అబ్బ జాగీరు కాదు.. పెన్షన్, రేషన్ కార్డులు పోవడానికి. అది మన సొమ్ము అంటూ వ్యాఖ్యానించారు. ప్రజల హక్కు హరించడానికి కెసిఆర్ ఎవరు..? అంటూ ఈటల ప్రశ్నించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నావు కదా కెసిఆర్..65 రోజులుగా ఎందుకు దళిత బంధు ఇవ్వలేదు అంటూ నిలధీశారు.
అర చేతిలో బెల్లం పెట్టీ మోచేతిని నాకిస్తున్నారంటూ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను సాదు కుంటార? చంపు కుంటారా? నా ప్రాణం ఉన్నంతవరకు కెసిఆర్ తో కొట్లాడతా అంటూ ఈటల వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల్లార మీకు సిగ్గు ఉందా? ఇందుకా మీకు ప్రజలు ఓట్లు వేసిందంటూ ప్రశ్నించారు. ఇది నిజాంలాగా నువ్వు, నీ కొడుకు, నీ మనవడి రాజ్యం కాదు కేసీఆర్ అంటూ ఈటల ఫైర్ అయ్యారు.