తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యుల జాబితా

Garikapati Rajesh

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నూత‌న పాల‌క‌మండ‌లిని ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. 25 మంది స‌భ్యులుగా ఉన్నారు. ఏపీ నుంచి న‌లుగురు, తెలంగాణ నుంచి న‌లుగురు, క‌ర్ణాట‌క నుంచి ఇద్ద‌రు, త‌మిళ‌నాడు నుంచి ముగ్గురు, మ‌హారాష్ట్ర నుంచి ఒక్క‌రు ఇందులో స్థానం సంపాదించుకున్నారు. అధికార వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా కొన‌సాగుతున్నారు. పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వరరావు, హేటిరో గ్రూప్ పార్థ‌రధి రెడ్డి, మారంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ముంబాయికి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోసారి కూడా తితిదే పాల‌క‌మండి స‌భ్యులుగా నియ‌మితుల‌య్యారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్‌యన్ ల్యాబ్స్ జీవన్‌రెడ్డి, కోల్‌కతాకు చెందిన సౌరభ్, మహారాష్ట్ర నుంచి శివసేన‌ కార్యదర్శి మిలింద్‍ కొత్తగా నియ‌మితులైన‌వారిలో ఉన్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పోక‌ల అశోక్‌కుమార్‌, గొర్ల బాబూరావు, మ‌ల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి
తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరావు,  పార్థసారధి రెడ్డి, కల్వకుర్తి విద్యాసాగర్‌, రాజే శర్మ
తమిళనాడు నుంచి ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య, శ్రీనివాసన్,
కర్ణాటక నుంచి శశిధ‌ర్‌, ఎమ్మెల్యే విశ్వనాధ్‌రెడ్డి
మహారాష్ట్ర నుంచి మిలింద్‌

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు: