బ్రేకింగ్‌: లూలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు ఇంత శుభ‌వార్తా...

VUYYURU SUBHASH
ప‌శువుల దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఎట్టకేలకు శుభ‌వార్త వినిపించింది. ఈ శుభ‌వార్త కేవ‌లం లాలూకే కాకుండా... ఆర్జేడీ అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం నింపింది. లాలూకు బెయిల్ లభించింది. రాంచీ హైకోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించి మొత్తం నాలుగు కేసుల్లో లాలూ నిందితుడిగా ఉన్నారు. 1990ల్లో దుంకా ట్రెజరీ నుంచి లాలూ అక్రమంగా రూ. 3.13 కోట్లు విత్ డ్రా చేశారంటూ నమోదైన కేసులో... సీబీఐ కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: