మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవాలయాలు శివన్మామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఎక్కడికక్కడ శివాలయాల్లో పూజలు చేస్తున్నారు. ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ పరిధిలోని లేపాక్షి దుర్గా పాపనశేశ్వర ఆలయంలో భార్య వసుంధరతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే దేవాలయానికి చేరుకున్న బాలయ్య దంపతులు మూలవిరాట్టును సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.