ఏపీ మంత్రిని చుట్టుకున్న కులం వివాదం...

కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న విజయవాడలో ఒక హోటల్ లో జరుగుతున్న సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్న నేపధ్యంలో... వైశ్యుడైన  మంత్రి వెల్లంపల్లి, విజయవాడలో జరుగుతున్న ఆర్యవైశ్యుల సమావేశాన్ని  అడ్డుకోవడమేంటి? అని ఆయన నిలదీశారు. శాంతియుతంగా జరుగుతున్న సమావేశాన్ని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? అని ఆయన నిలదీశారు. వైశ్యులను రెచ్చగొట్టేలా మంత్రి వెల్లంపల్లి వ్యవహరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
సమావేశానికి హాజరైన 13 జిల్లాల ఆర్యవైశ్య ప్రతినిధులు మంత్రి తీరుని తప్పుపట్టారు అన్నారు. తుంగభద్ర పుష్కరాలు కూడా సరిగా నిర్వహించలేని వ్యక్తికి దేవాదాయ శాఖ ఎందుకు?  అని నిలదీశారు. చంద్రబాబు నాయుడి హాయాంలో నిర్మించిన స్నానాల ఘాట్ లకే రంగులేసి, రూ.200 కోట్ల పైచిలుకు నిధులు కాజేశారని ఆయన విమర్శించారు. తాను నోరు తెరిస్తే వెల్లంపల్లి బయట తిరగలేడు అని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: