కేసీఆర్ ఇస్తే జగన్ ఎందుకు ఇవ్వడం లేదు...?

ఏపీలో తుంగభద్ర పుష్కరాల వ్యవహారం ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ అయింది. ఏపీ సర్కార్ పై ఇప్పుడు హిందు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పుష్కరాల విషయంలో రాష్ట్ర సర్కార్ సరిగా వ్యవహరించడం లేదని హిందు సంఘాలు మండిపడుతున్నాయి. ఇక తాజాగా పోరాటానికి కూడా హిందు సంఘాల నేతలు సిద్దమయ్యారు. ఏపీ సర్కారు తీరుని నిరసిస్తూ చలో తుంగభద్ర కి పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు.
సంకల్ బాగ్ ఘాట్ వద్ద తుంగభద్ర నదిలో దిగి పుణ్య స్నానాలు ఆచరించిన బీజేపీ రాష్ట్ర నేత హరీష్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.సీఎం జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే.. జగన్ ఎందుకు ఇవ్వడం లేదని  ప్రశ్నించారు. జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విహెచ్ పి బీజేపీ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు... స్టేషన్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: