విశాఖ అక్రమాలపై సిట్ కీలక ప్రకటన

విశాఖ  భూ అక్రమాలపై సిట్ కీలక ప్రకటన చేసింది. భూ అక్రమాల గురించి ఈనెల 21,22 తేదీలలో జిమెయిల్ ద్వారా ప్రజల నుంచి సూచనలు సలహాలను sit19suggest@gmail.com కి పంపాలి అని పేర్కొన్నారు. సిట్ -2019 పరిశీలిస్తున్న అంశాలైన ప్రభుత్వ భూమి మార్పు, వెబ్ ల్యాండ్ లో వివరాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఎన్వోసిల జారీ చేసారు.
ప్రభుత్వ భూములు అక్రమణలు, కబ్జాలు ఎటువంటి నిర్ణీత విధి విధానాలను పాటించకుండా ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసారని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడానికి పాల్పడిన అధికార్లు, అనధికార్లను గుర్తించడం వంటి అంశాలు ప్రస్తావించారు. ఫిర్యాదులను, అభిప్రాయాలను తెలిపేందుకు మరో అవకాశం ఇస్తున్నాం అన్నారు. జిమెయిల్ ద్వారా పంపే సూచనలు, సలహాలు క్లుప్తంగా నిర్దేశించిన విషయ ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: