విశాఖ అక్రమాలపై సిట్ కీలక ప్రకటన
ప్రభుత్వ భూములు అక్రమణలు, కబ్జాలు ఎటువంటి నిర్ణీత విధి విధానాలను పాటించకుండా ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసారని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడానికి పాల్పడిన అధికార్లు, అనధికార్లను గుర్తించడం వంటి అంశాలు ప్రస్తావించారు. ఫిర్యాదులను, అభిప్రాయాలను తెలిపేందుకు మరో అవకాశం ఇస్తున్నాం అన్నారు. జిమెయిల్ ద్వారా పంపే సూచనలు, సలహాలు క్లుప్తంగా నిర్దేశించిన విషయ ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొన్నారు.