ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో మొట్టమొదటి సారిగా నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్(ఎన్ఎంఆర్సీ) ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు 'ప్రైడ్ స్టేషన్'గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. గౌతం బుద్ధ నగర్ ఎంపీ మహేష్శర్మ, నోయిడా శాసనసభ్యుడు పంకజ్సింగ్, ఎన్ఎంఆర్సీ మేనేజింగ్ డైరెక్టరు రితు మహేశ్వరిలు నిర్వహించిన కార్యక్రమంలో కొత్త పేరును ఆవిష్కరించారు.
మెట్రో స్టేషనులో పనుల కోసం ఎన్ఎంఆర్సీ నియమించిన ఐదుగురు హిజ్రాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పశ్చిమ యూపీలోని జంట నగరాలు నోయిడా, గ్రేటర్ నోయిడాల మధ్య మెట్రో సర్వీసును నడిపే ఎన్ఎంఆర్సీ డిప్యూటీ జనరల్ మేనేజరు (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) సంధ్యాశర్మ మట్లాడుతూ... నియామకానికి ముందే హిజ్రాలకు అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: