పాక్ గూఢచర్యం వహిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన నిఘా విభాగం..!

Lokesh
భారత సైన్యానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్​కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని రాజస్థాన్​ బాడ్మేర్​లో అదుపులోకి తీసుకున్నారు ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం, సీబీ-సీఐడీ అధికారులు. నిందితుడు సరిహద్దులో వేతన కార్మికుడిగా పనిచేస్తూ గూడఛర్యం చేస్తున్నాడని.. కొద్ది కాలంగా అతడిపై నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు.నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా.. భారత సైన్యానికి చెందిన వివరాలను ఐఎస్​ఐ(పాక్​ నిఘా సంస్థ)కు పంపుతున్నట్టు అధికారులు ఆరోపించారు. అతడిని బాడ్మేర్​ ​ నుంచి జైపుర్​కు తరలించినట్టు వెల్లడించారు.

అంతకుముందు.. పాకిస్థాన్​కు గూఢచర్యం వహిస్తున్నాడనే ఆరోపణలతో 36ఏళ్ల వ్యక్తిని జైసల్మేర్​ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతా దళ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సామ్​ ప్రాంతానికి చెందిన నవాబ్​ ఖాన్​గా గుర్తించారు. డబ్బు కోసం.. వాట్సాప్​ ద్వారా కోడెడ్​ సమాచారాన్ని పాకిస్థాన్​కు అతడు చేరవేస్తున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: