ఇకపై భారతీయ విశ్వవిద్యాలయాలు అక్కడ కూడా..?
అసోంలోని ఐఐటీ-గువాహటి స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోదీ. విద్యా రంగంలో భారత హోదాను పెంపొందించేందుకు ఐఐటీ-గువాహటి కీలక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.యువత ఆలోచనలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని మోదీ తెలిపారు. విద్యార్థులు కన్న కలలను నిజం చేసుకునే క్రమంలోనే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.