ఈ చిట్కాతో ఎంతటి కొవ్వైనా కరగాల్సిందే?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పే పొడిని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోని  వాడడం కూడా చాలా ఈజీ. ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక అధిక బరువు సమస్య నుండి బయటపడేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి..దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి మనం సోంపు గింజలను, పసుపును, అవిసె గింజలను, జీలకర్రను, కరివేపాకును, కరక్కాయను, సైంధవ లవణాన్ని ఇంకా ఇంగువను వాడాల్సి ఉంటుంది.ముందుగా 25 గ్రాముల అవిసె గింజలను, 50 గ్రాముల సోంపును ఇంకా 25 గ్రాముల జీలకర్రను చిన్న మంటపై విడివిడిగా వేయించాలి.ఆ తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిలో 25 గ్రాముల కరక్కాయ పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువ ఇంకా 25 గ్రాముల కరివేపాకు పొడి వేసి మరోసారి మిక్సీ చేసుకోవాలి.


ఇలా తయారు చేసుకున్న పొడిని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతి రోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ డోస్ లో వేసి కలిపి తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.చాలా వేగంగా ఫలితం కావాలనుకున్న వారు దీనిని ఉదయం పూట అల్పాహారం చేసిన గంట తరువాత అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన గంట తరువాత తీసుకోవాలి. ఈ విధంగా ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. ఇంకా అంతేకాకుండా ఈ పొడిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. అయితే ఈ టిప్ ని పాటించేటప్పుడు బయట లభించే జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను మాత్రం అస్సలు తీసుకోకూడదు. నేటి కాలంలో చాలా మంది అధిక బరువు, అధిక పొట్ట సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ టిప్ ని వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: