ఇలా చేస్తే ముఖం దెబ్బకు తెల్లగా మారుతుంది!

Purushottham Vinay
ఇక చాలా మంది కూడా తమ మొహం నల్లగా ఉందని తెగ బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు. తెల్లగా మారేందుకు వేలకు వేల డబ్బులను ఖర్చు చేస్తూ… సబ్బులు, ఫేస్ వాష్ లు ఇంకా క్రీములు… ఇలా చాలా వాటిని కూడా వినియోగిస్తుంటారు.కానీ వీటి వల్ల అప్పుడు తెల్లబడినా కానీ మళ్లీ క్రీములు పెట్టడం మానేస్తే మునుపటి రంగు ఖచ్చితంగా తేలుతారు. అలాగే రసాయనాలు కలిపిన క్రీముల వల్ల కూడా సైడ్ ఎఫెక్స్ట్ కూడా ఉంటాయి.ఇక వీటన్నిటికి చెక్ పెడుతూ ముఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్కోడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. కేవలం ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే పదే పది నిమిషాల్లో ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ముఖ చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా బాగా అందుతాయి.అలాగే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలుఇంకా పొల్యూషన్ వల్ల వచ్చే మురికిని శుభ్ర పరిచి ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక ఈ చిట్కా ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో స్పూన్ పంచదార, ఒక స్పూన్ రాగి పిండి ఇంకా స్పూన్ శనగ పిండి అలాగే స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి.


ఇక వీటన్నింటిని కూడా బాగా కలిపి ఇందులో కొద్దిగా నీటిని వేసి కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమాన్ని మొహంపైన మీరు అప్లై చేసుకోవాలి. ఇలా ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా ముఖాన్ని మసాజ్ చేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలి.ఇక ఇందులో వాడిన పంచదార ముఖంపై పేరుకు పోయిన వైట్ హెడ్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ ను తొలగించి మూఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. అలాగే రాగి పిండిలో ఉన్న అమైనో ఆమ్లాలు కూడా మీ చర్మంపై కొల్లాజెన్ ఏర్పడడానికి సహాయ పడుతుంది.అలాగే లైసిన్ వంటి ముఖ్యమై అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల మృత చర్మ కణజాలాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే ముఖంపై రాగి పండిని తరచూ రాయం వల్ల కూడా చర్మంపై వృద్దాప్యా ప్రభావాలను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: