మహీంద్రా ఎక్స్యూవీ 3XO కొన్ని నెలల ముందు ఇండియాలో విడుదల అయ్యింది.ప్రస్తుతం ఈ కారు బుకింగ్స్ కూడా తీసుకుంటుంది. మే 26 నుంచి ఈ కారు నుంచి కొన్ని వేరియంట్ల డెలివరీలు కూడా జరుగుతున్నాయి.గత రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 2500 యూనిట్లకు పైగా కార్లను మహీంద్రా డెలివరీ చేసింది. తాజాగా ఈ కారు బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. మహీంద్రా మహీంద్రా XUV 3XOలో పనోరమిక్ సన్రూఫ్ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్ అందిస్తున్న కారు ఇదే కావడం విశేషం. కారు లోపల మంచి గాలిని, అవుట్ డోర్ వాతావరణాన్ని ఆస్వాదించే అనుభూతిని పొందడానికి ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ఇంకా కస్టమర్లకు ఎక్కువ సేఫ్టీ అందించడానికి మహీంద్రా మహీంద్రా XUV 3XOలో లెవల్ 2 ADAS టెక్నాలజీని వాడింది. గతంలో ఈ టెక్నాలజీని కేవలం ఖరీదైన కార్లకు మాత్రమే అందించేవారు. ఈ టెక్నాలజీతో ఈ కారు కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికుల్ని సులభంగా రక్షిస్తుంది.
ఈ ఏడీఏఎస్ టెక్నాలజీలో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ ఇంకా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లున్నాయి. మహీంద్రా XUV 3XO డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. ఇది డ్రైవర్ , ఫ్రంట్ ప్యాసింజర్కి అవసరమైన ఉష్ణోగ్రతను ఉంచడానికి అనుమతిస్తుంది. స్పెషల్ కూలింగ్ ఆప్షన్ని కలిగి ఉంది. దూర ప్రయాణాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది.దీనిలో మూడు స్టీరింగ్ మోడ్స్ ఉన్నాయి. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో 3 స్టీరింగ్ మోడ్ ఆప్షన్తో వచ్చిన ఫస్ట్ కారు ఇదే. ఇది సిటీ రైడ్లో ఈజీగా ఉంటుంది. ఇక ఈ కారు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పై ప్రయాణిస్తుంది. మహీంద్రా XUV 3XOలో ఆటో హోల్డ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ను ఫిక్స్ చేశారు. ఒక బటన్ నొక్కితే కారు కదలకుండా సులభంగా ఆగిపోతుంది. ఈ కార్ సెంటర్ కన్సోల్ ప్రాంతంలో ఎక్కువ స్థలాన్ని ఆదా చేస్తుంది. ఈ కారు మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు బుకింగ్స్ ఓపెన్ చేసిన 60 నిమిషాల్లో 50,000 లకు పైగా కస్టమర్లు దీన్ని బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారు ఇంటర్నెట్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది.