జావా బైక్ లవర్స్ కి షాక్.. పెరిగిన ధరలు..
జావా మోటార్ బైక్స్ పోర్ట్ఫోలియోలో అత్యంత ఖరీదైన బైక్ ఏదంటే అదే జావా పెరాక్. జావా కంపెనీ ఈ బైక్ ధరను సుమారు రూ.8,700 మేర పెంచడం జరిగింది. ఇక తాజా ధరల పెరుగుదల తరువాత మార్కెట్లో జావా పెరాక్ మోటార్సైకిల్ ధర ఇప్పుడు రూ.1.97 లక్షల నుండి 2.06 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగడం జరిగింది.ఇక అందరూ బాగా ఇష్టపడే జావా 42 బైక్ ధర కూడా భారీగానే పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే జావా మోటార్ బైక్స్ ఈ మోడల్లో అల్లాయ్ వీల్స్తో కూడిన వేరియంట్లను మార్కెట్లో విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు ఈ జావా 42 అల్లాయ్ వీల్ వేరియంట్లో ధర రూ.7,000 వరకు పెరిగడం జరిగింది.ఇక తాజా ధరల పెరుగుదల తరువాత, జావా 42 డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.1.91 లక్షలకు చేరుకోవడం జరిగింది.ఇక గడచిన ఫిబ్రవరిలో కంపెనీ ఈ బైక్ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ధర వచ్చేసి అప్పుడు రూ.1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది.ఇక ఇవే కాకుండా జావా 42 స్పోక్ వీల్ ఇంకా జావా స్టాండర్డ్ మోడల్స్ వంటి ఇతర జావా మోటార్ బైక్స్ ధరలను కూడా రూ.1,000 వరకూ పెంచడం జరిగింది. ఇక ఈ రెండు బైక్లు కూడా జావా 42 అల్లాయ్ వీల్స్ వేరియంట్ లాగానే ఎంతో అప్డేటెడ్ ఇంజన్ను కలిగి ఉంటాయి.