సరికొత్తగా అదరగొడుతున్న కియా సెల్టోస్..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కియా మోటార్స్ 2019వ సంవత్సరంలో కియా సెల్టోస్ ఎస్‌యూవీని ఇండియా మార్కెట్లో విడుదల చేయ్యడం జరిగింది. కియా కంపెనీ ఈ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటినుంచి బాగా క్రేజ్ సంపాదించుకొని ఎక్కువ ప్రజాదరణ పొందింది.ఇండియా మార్కెట్లో కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీ అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి ఇది పోటీగా నిలుస్తుంది. కియా మోటార్స్ సోనెట్ ఎస్‌యూవీ కార్ ని ఇండియా మార్కెట్లో, లగ్జరీ ఎమ్‌పివి సెగ్మెంటే కార్నివాల్ అలాగే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అమ్ముతుంది.కియా మోటార్స్ ఇండియా మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్రను వేసుకుంది. అయిన కాని కంపెనీ దీనిని కొన్ని ఎక్స్ ట్రా ఫీచర్లతో అప్‌డేట్ చేయాలని చూస్తోంది.

సెల్టోస్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో రెండవ కార్ . ఎక్కువమంది వాహనదారుల ఫస్ట్ ఛాయిస్ ఈ కియా సెల్టోస్ కార్. ఇది చాలావరకు కొత్త ఫీచర్ లు కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులు దీని పై ఆకర్షితులవుతున్నారు. ఈ ఎస్‌యూవీ కార్ లో గ్లోసీ బ్లాక్ టైగర్ నోస్ గ్రిల్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, ఎల్‌ఈడీ హెడ్ లాంప్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్, ఎల్‌ఈడీ టైల్ లాంప్ మొదలైన పార్ట్స్ ఉన్నాయి.ఈ కియా సెల్టోస్ ఎస్‌యూవీ కార్ 1.5 ఇంజన్ ఆప్షన్లతో 1.5 లీటర్ ఎన్‌ఏ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంకా 1.4 లీటర్ టర్బో పెట్రోల్‌తో విక్రయిస్తున్నారు.ఈ కార్ మంచి పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండటం ఆసక్తి కలిగించే విషయం.ఇక కియా సెల్టోస్ ఎస్‌యూవీ ధర ఇండియాలో రూ. 9.95 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ ఇండియా మార్కెట్లో ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, నిస్సాన్ కిక్స్ ఇంకా స్కోడా కుషాక్ వంటి వాటి ఎస్‌యూవీ కార్లకు పోటీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: