మహీంద్రా కార్ల పై భారీ తగ్గింపు..ఏప్రిల్ 30 వరకే..

Satvika
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారి మన దేశాన్ని వదిలి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో సరైన మార్కెట్ లేకపోవడంతో తినే కాయకూరలు నుంచి వాడే వాహనాల వరకు అన్నిటికీ డిమాండ్ తగ్గింది. కొన్ని వాహన సంస్థలు గత ఏడాది వచ్చిన వాటి పై భారీ తగ్గింపును ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు చేరగా ఇప్పుడు తాజాగా మరొక కంపెనీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. ఇటీవల లాంచ్‌ చేసిను థార్‌ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్‌ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అఫర్‌లో దాదాపు 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ రేట్లు ఏప్రిల్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్ లో ఈ ఆఫర్లు గురించి తెలిపింది.

ఆసక్తిగల కొనుగోలుదారులు కెయువి 100 ఎన్‌ఎక్స్‌టి నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా అల్టురాస్ జీ 4 ఎస్‌యూవీ కొనుగోలుపై మొత్తం 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో 22.2 లక్షల వరకు నగదు ఆఫర్ రూ 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫర్ , ఇతర ప్రయోజనాలు వరుసగా 16,000, 20,000 వరకు  తగ్గింపు ఉండగా,మరాజ్జో ఎంపీవీలో అందించే గరిష్ట తగ్గింపు 41,000 రూపాయలు. ఇందులో రూ. 20,000 వరకు నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6,000 వరకు లభిస్తాయి.. మీకు ఈ ఆఫర్లు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: