పాత లవర్ తో టచ్ లోకి రష్మిక మందన్న ?

VAMSI
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా ఆఫర్ లను అందుకుంటూ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ లు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఇంకొకరు కన్నడ భామ రష్మిక మందన్న. ఇద్దరిలోనూ పెద్దగా నటన లేకపోయినా... డైరెక్టర్ లు వరుస పెట్టి వీరికే అవకాశాలు ఇస్తున్నారు. రష్మిక మందన్న ఇటీవల నటించిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయినవే కావడం విశేషం. ఇక అల్లు అర్జున్ తో చేసిన పుష్ప లో శ్రీవల్లి పాత్రకు ఎక్కడలేని ప్రాముఖ్యత లభించింది. దీనితో మరికొన్ని సినిమా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇదిలా ఉంటే తాను ఎంత స్టార్ హీరోయిన్ కావడానికి ప్రధాన కారణం కన్నడలో తాను నటించిన కిరాక్ పార్టీ పెద్ద హిట్ కావడమే. ఇందులో రక్షిత్ శెట్టి మరియు రష్మిక మందన్న లు హీరో హీరోయిన్ లుగా నటించారు.
అయితే ఈ సినిమా ముందు నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు మరియు లవర్స్ కూడా... వీరి ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లడానికి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అందులో భాగంగా నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ రష్మిక కు కెరీర్ గురించి ఆలోచన రావడంతో సడెన్ గా రక్షిత్ శెట్టికి బై బై చెప్పేసింది. ఆ తర్వాత జరిగిందంతా మనము తెలిసిందే. టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఇక్కడ వరుస అవకాశాలను అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగడం చూశాము. ఇక రష్మిక లవర్ సైతం ఇవన్నీ లైట్ తీసుకుని కెరీర్ పై దృష్టి పెట్టాడు. ఇతని నుండి జూన్ 10 న వచ్చిన చిత్రం చార్లీ 777 . ఈ సినిమాను కిరణ్ రాజ్ డైరెక్ట్ చేశాడు. ఇది అంచనాలకు మించి హిట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అయింది.
సో... ఈ సినిమా సక్సెస్ అవడంతో మళ్ళీ రక్షిత్ శెట్టి కెరీర్ ఊపందుకుంది అని చెప్పాలి. ఈ సినిమాతో తనకు ఒక కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ్ మరియు మలయాళంలోనూ మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో బెంగుళూరు లో పార్టీ ఇస్తున్నాడట రక్షిత్ శెట్టి. ఈ పార్టీకి రష్మికను కూడా పిలిచాడట... అయితే తాను వస్తుందని తెలుస్తోంది. మరి ఇది కనుక ఓకే అయితే మళ్ళీ వీరి ప్రేమ చిగురించినట్లే... అయితే ప్రస్తుతం ఇది ఒక గాసిప్ మాత్రమే. ముందు ముందు నిజమవ్వాలని కోరుకుందాం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: