స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాలకు బ్రేక్ కారణం ఇదే?

VAMSI
చిన్న స్టేజ్ నుండి వచ్చి ప్రతిభతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నటులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సాయి పల్లవి. ఒక డ్యాన్స్ షోలో పార్టిసిపెంట్ గా తన కెరియర్ ను ఆరంభించి నేడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఆమె ప్రతిభ, పనిపై ఉన్న నిబద్దత గురించి ప్రత్యేకంగా చెప్పాలా... ఫిదా సినిమాతో సినీ ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్ అయిపోయిన సాయి పల్లవికి అభిమానుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే ఈమె గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సంచలనంగా మారింది. ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెంచడంతో ఈమె పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని అందుకే కొత్తగా ఈమె ప్రాజెక్ట్ లు వేటికీ సైన్ చేయడం లేదు అని టాక్ వినపడుతోంది.
ఇటీవల లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో వరుస సక్సెస్ లను అందుకున్న ఈ హీరోయిన్ వీటి తరవాత ఏ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఈమె పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అని అందుకే కొత్తగా ఏ సినిమాకి ఒప్పుకోలేదని అంటున్నారు. అంతేకాదు దీని వెనుక ఒక పెద్ద కారణమే ఉందని మరో టాక్. ఈమధ్య నాగ చైతన్య సాయి పల్లవిని రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని వార్తలు వినిపించగా... ఇపుడు ఆ వార్తలు నిజమే అని సాయి పల్లవి అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతోందని ప్రచారం సాగుతోంది. అందుకే ఆమె ఇండస్ట్రీ నుండి మెల్లగా తప్పుకోవాలని అనుకుంటున్నారట... ఎందుకంటే ఈ సారి వచ్చే కోడలు ఇంటిపట్టున ఉంటూ అక్కినేని అమలలా ఇంటి బాధ్యతలను పూర్తిగా తీసుకుని ఒక మంచి గృహిణిగా పేరు తెచ్చుకోవాలన్నది నాగ్  అనుకుంటున్నారట.
అయితే లవ్ స్టోరీ సినిమా చేశాక చై సాయి పల్లవి ప్రేమలో పడ్డారు అని ఇపుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అందుకే సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్ లపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ చై, సాయి పల్లవి జంట కన్నుల పండుగే అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: