మూడు ముళ్ళు పడగానే "ఇంస్టా గ్రామ్" ప్రొఫైల్ మార్చేసిన అలియా?

VAMSI
గడిచిన నాలుగు ఐదు సంవత్సరాలుగా ప్రేమ అనే ప్రపంచంలో విహరిస్తూ లవ్ బర్డ్స్ గా ఉన్న అలియా భట్, రణబీర్ కపూర్ లు ఎట్టకేలకు ఈ ఏప్రిల్ 14న పెళ్లి అనే బంధంతో ఒక్కటి అయ్యారు. రణబీర్ కపూర్ బాంద్రా నివాసి అయిన 'వాస్తు'లో తన కుటుంబ సభ్యులు, అలాగే తనకి అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం అయ్యే వరకూ కూడా వివాహ వేడుకకు సంబంధించిన ఎటువంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా వీరు వివాహం అయిన వెంటనే మీడియా ముందుకు ఎంట్రీ ఇచ్చారు.
అంతే కాదు  పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనితో ప్రేక్షకులంతా పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమాలతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే అలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికపుడు తన అప్డేట్స్ ను ప్రేక్షకులకు అందిస్తుంటారు. మరి ఈ క్రమంలోనే వివాహం జరిగిన మరుక్షణమే ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ పిక్ ను మార్చేశారు. ఇప్పటి వరకు తను ఒక్కరే ఉన్నటువంటి పిక్ ను మార్చేసి తన వివాహానికి  సంబంధించిన ఫోటోను ప్రొఫైల్ గా పెట్టుకున్నారు.
పెళ్లి దుస్తులతో ఏంతో చక్కగా ఉన్న ఆలియా, రణబీర్ ల ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ గా పెట్టారు. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వీరి జోడీ మీద పెద్ద ఎత్తున కామెంట్లును షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రణబీర్ కపూర్ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అడుగు పెట్టని సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి తరువాత రణబీర్ కపూర్ సోషల్ మీడియాలో కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం వీరి పెళ్లికి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: