రేష్మి గురించి ఈ విషయాలు తెలుసా...?

VAMSI
జబర్దస్త్ షోతో తన గ్రాఫ్ ను పెంచుకుని గొప్ప గుర్తింపు పొందింది యాంకర్ రేష్మి. ఈ అందాల తార స్టేజ్ పైకి వచ్చింది అంటే ఇక కుర్ర కారు హృదయాలకు బ్రేకులు పడవు. హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ తో దూసుకు పోతున్న రేష్మికి సోషల్ మీడియాలోనూ క్రేజ్ ఫుల్ గా ఉంది. ఇటు బుల్లితెరపైనే కాదు జబర్దస్త్ తో వచ్చిన ఫేం తో అటు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. అలాగే 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే మూవీలో లీడ్ రోల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇపుడు రేష్మికి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
ఈమె సొంత ఊరు ఒడిశా రాష్ట్రంలోని బరం పూర్. రేష్మి గౌతం తల్లి మమత మరియు తండ్రి వీరేంద్ర గౌతం లకు 1988 లో ఏప్రిల్ 7 న ఈమె జన్మించారు. హోలీ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార జబర్దస్త్ షో తో బుల్లి తెరపై  అభిమానుల్ని పెంచుకుంది. రేష్మి కి ఒక డిఫరెంట్ ఫుడ్ హాబిట్ ఉంది. ఈమెకి ఆలూ పరోటా అంటే చాలా ఇష్టం. అయితే ఆలు పరోటాను పెరుగుతో తినడం అంటే చాలా చాలా ఇష్టం అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. రేష్మి ఒక్కో జబర్దస్త్ షో కి 40,000 రెమ్యూనరేషన్ అందుకుంటారు. అయితే ఈ మధ్య తనకు పెరిగిన డిమాండ్ ను వాడుకుంటూ దానిని కాస్తా 50 వేలకి పెంచి రౌండ్ ఫిగర్ చేశారని వార్తలు వినిపించాయి.
ఈమె తన కెరియర్ లో తను అందుకున్న మొదటి సంపాదన 25,000 అప్పట్లో రేష్మి కి బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అలా చాలా కష్టాలు పడి నేడు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని దూసుకుపోతున్నారు రేష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: