ఇన్ని విమర్శలు వచ్చినా సమంత మారలేదుగా?

VAMSI
సమంత, నాగ చైతన్య విడాకుల అనంతరం చై వరుస చిత్రాలపై దృష్టి పెట్టగా సామ్ మాత్రం స్నేహితులతో కలసి వరుసగా టూర్ లు వేస్తోంది. మొదట్లో విడాకులు అనంతరం ఆ దిగులుతో షూటింగ్ సమయంలో కూడా సమంత చాలా డల్ గా కనిపిస్తున్నారు అని, మూడీగా వుంటున్నారు అని చాలా వార్తలే వినిపించాయి. దానికి తోడు తీర్థ యాత్రలంటూ, టూర్ లంటూ సమంత ప్రయాణాలు చేయడం చూస్తుంటే నిజంగానే ఆమె మానసికంగా బాగా కుంగిపోయారు అని అందుకే ప్రశాంత కోసం ఇలా వరుసగా పుణ్య క్షేత్రాలకు , టూరింగ్ ప్లేసులకు వెళుతున్నారని అనిపించింది. ఇక ఇపుడేమో మరో టూర్ ప్లాన్ తో అభిమానులకు షాక్ ఇచ్చారు సమంత.
తన హెయిర్ స్టైలిష్అయిన ప్రీతమ్ జుల్కర్‌, మరియు ఇంకో స్నేహితురాలితో పాటు ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి ఫోటో కూడా అప్లోడ్ చేశారు సమంత. ఈ ఫోటోలో సామ్ ఇంకా వారి స్నేహితులు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్‌లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇలా సామ్ వరుస ప్రయాణాలు చూస్తుంటే నిజంగా గతాన్ని మరిచిపోవడానికి మరియు మానసిక ప్రశాంతత కోసమే ఇలా చేస్తున్నారని  అనిపిస్తోంది. విడాకుల అనంతరం ఎదుర్కొన్న సంఘర్షణలన్నింటినీ  మరచి పోయి మళ్ళీ తన రొటీన్ లైఫ్ ని స్టార్ట్ చేసి ఎప్పటిలా సంతోషంగా తన లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి  ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  


ఇక ఈ టూర్ లో ప్రీతం జవాల్కర్ ఉండటం విశేషం. సామ్, చైతు ల డైవర్స్ తరువాత ప్రీతం సామ్ ల రిలేషన్ పై చాలా కథనాలే వినిపించాయి. కానీ వీరి మధ్య ఉన్నది సోదరీ, సోదరుల బంధమని క్లారిటీ ఇచ్చి ఆ వార్తలకు పుల్ స్టాప్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సమంత ఇపుడు తన స్నేహితులతో కలసి ఫారిన్ లో ఏ ప్రదేశాలు చూడబోతుంది, ఆ తరవాత మళ్లీ ఏ ట్రిప్ వేస్తారు అన్న అంశాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇదంతా పరిశీలిస్తే సమంత చైతూతో విడిపోవాలని ఎప్పటి నుండో అనుకున్నట్లు ఉంది. అంతే కాకుండా ఇద్దరిపై ఇన్ని విమర్శలు వస్తున్నా సమంత వినకుండా మళ్ళీ ప్రీతం నే వెంటేసుకుని వెళ్లడం బాగాలేదని చైతు అభిమానులు పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: