త‌న పై ఆరోప‌ణ‌లు చేసిన వారికి ఘ‌టుగా బ‌దులు ఇచ్చిన హీరోయిన్‌

Dabbeda Mohan Babu
ప్ర‌స్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ల‌లో అగ్ర హీరోయిన్ గా కొన‌సాగుతున్న వారిలో పూజా హెగ్డే. అన్ని భాష‌ల్లో వ‌రుస సినిమా ల‌తో ఈ అమ్మ‌డు దూసుకుపోతుంది. ఒక లైలా కోసం అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్ర‌మ కు ప‌రిచ‌యం అయిన ఈ చిన్న‌ది అప్ప‌టి నుంచి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఉన్న అగ్ర హీరో లంద‌రితో పూజా హెగ్డే సినిమా లు తీస్తుంది. ప్ర‌స్తుతం తెలుగు లో అక్కినేని హీరో అఖిల్ తో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ అనే సినిమా లో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా ను బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అలాగే ఈ సినిమా ను ఈ నెల 15 న థీయేట‌ర్స్ ల‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్ర‌మోష‌న్ ల‌లో పూజా మీడియా తో మాట్లాడింది.

ఈ మ‌ధ్య కాలంలో త‌న పై వ‌స్తున్న ప‌లు ఆరోప‌ణ ల‌పై తీవ్రం గా స్పందించింది. తాను పారితోషికం ఎక్కువ తీసుకుంటాను అని కొంత మంది అంటున్నారు. దీని పై పూజా హెగ్డే ఘ‌టు గా స్పందించింది. ఒక్క సినిమా హిట్ కొట్టి నందికే తాను పారితోషికం పెంచాన‌ని కొంత మంది అన్నారని తెలిపారు. ఇలాంటి విష‌యాల‌ను తాను ప‌ట్టించు కోన‌ని తెలిపారు. అలాగే హీరో ల పారితోషకాల గురించి చ‌ర్చ రాన‌ప్పుడు  హీరోఎయిన్ ల పారితోష‌కాలు ఎందుకు చ‌ర్చ కు వ‌స్తున్నాయ‌ని ఘ‌టుగా బ‌దులు ఇచ్చారు. అలాగే తాను సినిమా రంగం లోకి వ‌చ్చిన నాటి నుంచి త‌న లో చాలా మార్ప‌లు వ‌చ్చాయ‌ని తెలిపారు. ముఖ్యం గా స‌హ‌నం, ఓర్పు పెరిగాయ‌ని అన్నారు. షూటింగ్ స‌మ‌యాల్లో ఏ మాత్రం తేడా వ‌చ్చిన కోపం ఎక్కువ అని పోగురు బోతు త‌నం ఉంద‌ని అంటార‌ని గుర్తు చేసుకున్నారు. త‌న క‌ష్టం తో కాస్త అదృష్టం వ‌ల్లే ఈ రోజు ఈ స్థాయి కి వ‌చ్చాన‌ని తెలిపారు. ఇలా త‌న పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల పై తీవ్రం గా పూజా హెగ్డే బ‌దులు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: