మహిళలు ముప్పై తర్వాత పెళ్లి చేసుకుంటే అనర్థాలే..!!
ఉద్యోగాలు చదువు అని చెప్పి 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనివల్ల వారి తల్లిదండ్రులపై లేని భారం పడుతోంది. పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. అందరికీ ఒక పర్టికులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కొంతమందికి పెళ్లి కంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. ఒక స్టేజ్ కి వచ్చి వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వయసు లో పెళ్లి అయిన వారిలో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు జీవితంపైన కాకుండా కెరీర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలని అనుకొంటారు. ఇద్దరూ భాగస్వాములకు మధ్య అనుబంధం తగ్గిపోతుంది. ఫలితంగా వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతోంది. వేరే విషయాల మీద అంటే డబ్బు, ఆఫీస్, పార్టీ లు అంటూ బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ ఉండదు. సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి తెలుసు కాబట్టి వారు ఈ బంధాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశాలు లేవు. భవిష్యత్తు ప్లానింగ్ చేయడమే సరిపోతుంది. ప్రజెంట్ ను ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయరు. అందుకే ఎవరు కూడా ముప్పై కి మించి పెళ్లి చేసుకోకూడదు..