జాతీయ అవార్డు దక్కించుకున్న తెలుగు సినిమా మహర్షి..!!
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి నటించిన మహర్షి సినిమా టాలీవుడ్ రిలీజ్ అయ్యి రికార్డులను నెలకొల్పింది.. అంతరించిపోతున్న వ్యవసాయాన్ని బ్రతికించే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సూపర్ హిట్ లిస్ట్ లలో చేరిపోయింది.. అంతేకాదు ఈ సినిమా కి తప్పకుండా అవార్డు ను అంచనా వేశారు చిత్ర బృందం.. అనుకున్నట్లుగానే ఈ సినిమా కి జాతీయ అవార్డు వచ్చింది. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.. ఇకపోతే ఈ సినిమా లో మహేష్ బాబు తర్వాత చెప్పుకోవాల్సిన మరో పాత్ర అల్లరి నరేష్..
ఈ సినిమా కి మెయిన్ పాత్ర అయిన అల్లరి నరేష్ సినిమా ను మలుపు తిప్పే పాత్ర లో నటించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా ని కమర్షియల్ హంగులతో పాటు మెసేజ్ ను మిక్స్ చేసి తెరకెక్కించాడు. దిల్రాజు, సి.అశ్వినీదత్, పి.వి.పి నిర్మించగా ఈ సినిమా కి జాతీయ అవార్డు రావడం ఎంతో సంతోషపరిచే విషయమని ఆ చిత్ర నిర్మాత దర్శకుడు చెప్పారు.. మీడియా తో ముచ్చటించిన దర్శక నిర్మాతలు సినిమా గురించి పలు విశేషాలు పంచుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. 2019, మే 9న సినిమా విడుదలయి ఘనవిజయం సాధించిన ఈ సినిమా కి వచ్చిన అవార్డుని మహేష్ బాబు కి అంకితం చేస్తున్నాం అన్నారు. మహేష్ బాబు గారు ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అన్నారు.. చెప్పినట్లుగానే అయ్యింది అని గుర్తు చేసుకున్నారు..