అమ్మ : గర్భిణీ స్త్రీ అసలు తినకూడని ఆహార పదార్ధాలు ఇవే... !!

Suma Kallamadi
ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటో తెలుసా..  నవమాసాలు ఒక బిడ్డని కడుపులో మోసి ఆ బిడ్డకి ప్రాణం పోయడమే.ఈ సృష్టిలో ఒక్క అమ్మకు మాత్రమే ఒక జీవికి ప్రాణం పొసే అవకాశం ఉంది.ఎన్నో కష్టాలు పడి బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఆతృతతో ఎదురుచూస్తుంది. అయితే గర్భం వచ్చింది మొదలు బిడ్డను ప్రసవించేదాకా తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి.ఏది పడితే అది అసలు తినకూడదు. బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల్ల టాక్సోప్లాస్మాసిస్  (toxoplasmosis)అనే ఇన్ఫెక్షన్  వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీసే అవకాశం కలదు.
కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు తినకూడదు . దీనివల "లిస్టరియోసిస్ " అనే ఇన్ఫెక్షన్  వచ్చే అవకాశము ఉన్నది . దీనివల గర్భస్రావం అయ్యే   అవకాశము ఉన్నది


అలాగే శరీరానికి అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొ అంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.అలాగే నిల్వ ఉంచిన పచ్చళ్ళు కూడా అసలు తినకూడదు. అలాగే పాలు కూడా బాగా కాసిన తర్వాత తాగాలి. పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధములు తినకూడదు. పచ్చి గుడ్డు , సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్ధములు తినకూడదు . పచ్చి గుడ్డు లో సాల్మొనెల్లా అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.


కాఫీ లోని కెఫిన్‌,  కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది.సారా (Alcohol), సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును.దీనివల్ల కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును.కాయకూరలు బాగా కడిగి తినాలి .కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన అనేక రకాలు అయిన బాక్టీరియా ఉంటుంది. ఏది తల్లి బిడ్డ ఆరోగ్యానికి హానికరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: