విజయం మీదే: ఈ వ్యాపారం ద్వారా చక్కని లాభాలు మీవే?
వ్యాపారం ఏమిటంటే మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఉన్నా సరిపోతుంది. సక్సెస్ అయితే మాత్రం లాభాలకు కొదవ ఉండదు. మన దేశంలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని అందరికీ తెలిసిందే. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే వీటిని కనుక వినియోగించుకుని మసాలాలు తయారు చేసి ఆన్లైన్ లో మార్కెటింగ్ చేయగలిగితే మంచి లాభాలు అందుకోవచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మీరు మసాలాలు తయారు చేస్తే ఈజీగా అమ్మడు పోతాయి.
అలాగే వాటిని ఆప్లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లోనూ అందుబాటులో ఉంచితే బాగా వర్కౌట్ అవుతుంది. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నివేదికలో, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఉంటే సరిపోతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు పోగా రూ.60,000, పరికరాలు మరియు రూ.40,000. ఇది కాకుండా అదితర సంబంధిత పనులు ప్రారంభించేందుకు గాను రూ.2.50 లక్షలు అవసరం అవుతుంది. ఈ మొత్తంలో మీ వ్యాపారం ప్రారంభించి కాస్త పబ్లిసిటీ చేసుకోగలిగితే విజయం మీ సొంతం.