అయోధ్యలో రామమందిరం జనవరి 22నే ఎందుకు ప్రతిష్ట చేస్తున్నారో తెలుసా..?
అయితే 22వ తేదీని ఎందుకు ఈ రామ మందిరాన్ని ప్రారంభించాలి అంటే హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశిర నక్షత్రంతో జగదభి రాముడు జన్మించారట.. ఈ పవిత్రమైన కాలాన్ని జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.. అభిజిత్ ముహూర్తంలో రోజులు అత్యంత శక్తివంతమైన సమయము దాదాపుగా 48 నిమిషాల పాటు ఇది ఉంటుందట.. అయితే అభిజిత్ ముహూర్తం జనవరి 22వ తేదీన..12:16 గంటలకు ప్రారంభమై 12:59 నిమిషాలకు ముగుస్తుంది.
ఈ సమయంలో శివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సైతం వాదించారు.హిందువులకు ఇది శుభ ఘడియంగా సూచిస్తారు. మృగశిర నక్షత్రం అంటే 27 నక్షత్రాలలో ఐదవదని అర్థము..మృగశిర అంటే జింకశాల ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు కష్టపడి పని చేస్తారని అర్థము. అంతేకాకుండా తెలివైన వారు అని కూడా చెప్పవచ్చు శ్రీరాముడు కూడా ఈ నక్షత్రంలోని జన్మించారు.. జనవరి 22న మృగశిర నక్షత్రం ఉదయం 3.52 గంటలకు ప్రారంభమై 7:13 నిమిషాల వరకు ఉంటుంది. రామ్ లాల ప్రతిష్టాత్మ కు సైతం ఎన్నో నిర్వహిస్తున్నారు దాదాపుగా గంటపాటు ఎన్నో యోగాలను కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ నెల 22వ తేదీన రామ మందిరాన్ని ప్రతిష్టిస్తున్నారు.